మా పిల్ల‌లు ఇలా గ‌డుపుతున్నారుః మంత్రి కేటీఆర్

198
IT minister ktr
- Advertisement -

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని విద్యాసంస్ధ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎప్రిల్ 14వ‌ర‌కు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేశారు. ఈసందర్బంగా ప‌లువురు సినీ, రాజ‌కీయ నాయ‌కులు కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. అంతేకాకుండా వారి కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.మీరు కూడా త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఇంట్లోనే ఉండాలని అభిమానుల‌కు సూచిస్తున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్ త‌మ పిల్ల‌ల గురించి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. మా అబ్బాయి, అమ్మాయి ఆన్ లైన్ స్కూలింగ్ చేస్తూ వారి పనుల్లో పడిపోయారంటూ ఆ ఫొటోలను జత చేస్తూ ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్. కాగా కేటీఆర్ పిల్లలు ఇద్ద‌రు ఆన్ లైన్ లో పాఠాలు వింటున్నారు. మంత్రి చేసిన ట్వీట్ కు ప‌లువురు కేటీఆర్ అభిమానులు సూప‌ర్ సర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -