లిక్విడ్ డిట‌ర్జెంట్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు..

34
- Advertisement -

షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులో రూ. 200 కోట్లతో ప్రొక్ట‌ర్ అండ్ గాంబిల్ సంస్థ ఏర్పాటు చేసిన లిక్విడ్ డిట‌ర్జెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫ్యూచ‌ర్ అంతా లిక్విడ్ డిట‌ర్జెంట్స్ అని పీ అండ్ జీ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా కంపెనీ యాజ‌మాన్యానికి హృద‌య‌పూర్వ‌కంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పీ అండ్ జీ శిక్షా ద్వారా తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు చెప్పారు. లింగ స‌మాన‌త్వం కోసం పీ అండ్ జీ చేస్తున్న కృషి ఎంతో ఆక‌ట్టుకుంద‌న్నారు. 2014లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాప‌న చేశార‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో రాష్ట్రంలో పీ అండ్ జీ త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించింద‌ని తెలిపారు. తెలంగాణ‌కు నిరంత‌రం మ‌ద్ద‌తు తెలుపాల‌ని కోరుకుంటున్నామ‌ని కేటీఆర్ చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజ‌య్య యాద‌వ్‌తో పాటు పీ అండ్ జీ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -