రోశయ్య మృతిపట్ల కేటీఆర్,కవిత సంతాపం..

233
ktr min
- Advertisement -

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత. కొణిజేటి రోశ‌య్య గారి మ‌ర‌ణం బాధాక‌ర‌మ‌ని ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా గతంలో రోశ‌య్య‌తో దిగిన ఫోటోల‌ను షేర్ చేశారు.

ఏపీ మాజీ సీఎం రోశ‌య్య మృతి ప‌ట్ల .. తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విచారం వ్య‌క్తం చేశారు. రోశ‌య్య కుటుంబ స‌భ్యుల‌కు, వారి అభిమానుల‌కు ఆమె ప్ర‌గాఢ సంతాపం ప్ర‌క‌టించారు. ఎన్నో కీల‌క ప‌ద‌వుల‌ను అలంక‌రించిన రోశ‌య్య ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచార‌ని, ఆయ‌న‌ మ‌ర‌ణం వారంద‌రిలో తీవ్ర విషాదాన్ని నింపిన‌ట్లు ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -