ఆచార్య జయశంకర్‌కు మంత్రి కేటీఆర్ నివాళి..

108
ktr
- Advertisement -

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కేటీఆర్‌ పేర్కొన్నారు. జయశంకర్ సార్‌ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని అన్నారు.

- Advertisement -