‘భీమ్లా నాయక్’పై మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర కామెంట్స్‌..

99
- Advertisement -

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఈ నెల 25న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అయితే ఈరోజు ఆయన ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సోదరులు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా, తమన్, సాగర్ చంద్రల చిత్రం ‘భీమ్లా నాయక్’ విడుదల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన చెప్పారు. మొగిలయ్య, శివమణి వంటి బ్రిలియంట్ సంగీత విద్వాంసులను కలవడం చాలా సంతోషంగా ఉందంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -