ఎన్నికల ప్రచారం..మంత్రి కేటీఆర్‌కు స్వల్ప గాయాలు

31
- Advertisement -

బీఆర్ఎస్ ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రచార రథంపై నుండి కిందపడ్డారు మంత్రి కేటీఆర్. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగి ప్రచార రథం పై నుండి మంత్రి కేటీఆర్‌తో కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కేటీఆర్‌ని పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి కింద పడటంతో వారికి గాయలయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి.

ఇక ఇవాళ సిరిసిల్లలో నామినేషన్ వేశారు మంత్రి కేటీఆర్. అనంతరం ఆర్మూర్ ఎన్నికల ప్రచారానికి రాగా ఈ ఘటన చోటు చేసుకుంది.ఎవరికి ఏం కాకపోవడంతో జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read:BRSలోకి మాజీ మంత్రి చంద్రశేఖర్

- Advertisement -