నగరంలో లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

162
ktr
- Advertisement -

హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే ఉద్దేశంతో పలు ప్రాంతాల్లో నిర్మించిన లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 నుంచి ఓల్డ్ ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్డును ప్రారంభించారు మంత్రులు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మరియు మేయర్బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -