డబుల్ బెడ్‌రూమ్‌ ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్…

148
ktr
- Advertisement -

హైదరాబాద్ వనస్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్. రెండు ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లుగా 9 అంత‌స్తుల్లో 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించారు. ఈ ఇండ్లను రూ.28కోట్ల వ్యయంతో నిర్మించారు.

ఇండ్ల ప్రారంభంతో ల‌బ్దిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఎన్నో ఏండ్ల క‌ల సాకార‌మైంద‌ని, సీఎం కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని ల‌బ్దిదారులు స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌ల్లేశం, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

- Advertisement -