సిరిసిల్ల రూపురేఖలు మార్చిన ఘనత..సీఎం కేసీఆర్‌దే

152
ktr
- Advertisement -

సిరిసిల్ల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండ‌లం వెంక‌టాపూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. విమ‌ర్శలు చేయ‌డం సుల‌భం.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నాం అన్నారు. కాంగ్రెస్,బీజేపీ ప‌రిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మించారా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు పోతోంద‌ని ….రాష్ట్ర ఆదాయం పెరిగింది. రాజ‌కీయం, ప్ర‌జాజీవితంలో సంతోషం ఎక్క‌డ అనిపిస్తుందంటే.. ఇది పేద‌వాడి ప్ర‌భుత్వ‌మ‌ని సునీత చెప్పిన‌ప్పుడు సంతోష‌మేసిందన్నారు.ప్ర‌తి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జ‌రుగుతోంది. స‌ర్కార్ హాస్పిట‌ల్లో రోగుల సంఖ్య పెరిగిందన్నారు.

- Advertisement -