పెద్ద మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..

265
ktr
- Advertisement -

ఆపదలో ఉన్నవారికి సాయం అందించడంలో ముందువరుసలో ఉండే మంత్రి కేటీఆర్‌ అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే. తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న రామన్న తాజాగా మరో కుటుంబానికి అండగా నిలిచారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన తుపాకుల స్వాతి అనే మహిళ విద్యుత్ ప్రమాదం జరగడంతో రెండు చేతులు చచ్చుబడ్డాయి. ఒక కాలు కూడా సగం వరకు తీసేశారు. నిరుపేద కుటుంబం కావడంతో వారి గోడును నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సభ్యుడు శ్రావణ్‌ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు.ఈ విషయాన్ని అధికారులు స్వాతి కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు ఆనందంవ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -