- Advertisement -
మంత్రి కేటీఆర్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి అండగా నిలిచారు. బుధవారం రాత్రి మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వెంటనే కాన్వాయ్ని ఆపి కిందికి దిగారు. ప్రమాద వివరాలను తెలుసుకుని వెంటనే తన కాన్వాయ్లోని వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఆ విద్యార్థుల పరిస్థితిపై ఆస్పత్రిలో ఆరా తీశారు. సమయానికి ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు నిలపడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -