ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఉదయం 9.30 గంటలకు, 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు సాయిమణి గార్డెన్లో బీఆర్ఎస్ యూత్ నాయకుడు కొర్రీ అ నిల్కుమార్ వివాహ వేడుకలకు హాజరవుతారు. 12.30 గంటలకు యూత్ నాయకుడు సుధాకర్ ఏర్పాటు చే సిన డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభిస్తా రు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్లకు చేరుకుంటారు.\
Also Read:Centre:విపత్తు నిరోధానికి రూ.8వేల కోట్ల కేటాయింపు
మున్నూరుకాపు సంఘ కల్యాణమండపంలో టీఆర్ఎస్వీ నేత శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకలకు హాజరవుతారు. 1.15 గంటలకు చేనేత వస్త్ర వ్యాపార సం ఘ భవనంలో వస్త్ర వ్యాపార సంఘం నూతన పా లకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎస్పీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మధ్యాహ్నం 3 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్ను ప్రారంభించనున్నారు కేటీఆర్.
Also Read:వెల్లుల్లితో ప్రయోజనాలు!