కరీంనగర్‌కు మంత్రి కేటీఆర్…

74
minister ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. క‌రీంన‌గ‌ర్ న‌గర అభివృద్ధిలో భాగంగా రూ.615 కోట్ల‌తో చేప‌ట్టే వివిధ అభివృద్ధి ప‌నుల‌కు కేటీఆర్ భూమి పూజ చేస్తార‌ని తెలిపారు మంత్రి గంగుల.

అదేవిధంగా రూ. 410 కోట్ల‌తో చేప‌ట్టే మానేరు రివ‌ర్ ఫ్రంట్ ప‌నుల‌కు భూమి పూజ‌చేస్తారు. మానేరు రివ‌ర్ ఫ్రంట్‌ను వ‌చ్చే 18 నెల‌ల్లో పూర్తిచేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఆలాగే రూ.615 కోట్ల కార్పొరేష‌న్ నిధుల‌తో చేప‌ట్టే ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తిచేస్తామ‌న్నారు గంగుల.

ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండండ‌ద‌ల‌తో క‌రీంన‌గ‌ర్‌ను రాష్ట్రంలోనే నంబ‌ర్ 2 సిటీగా మార్చుతున్నామ‌ని మంత్రి వెల్లడించారు.

- Advertisement -