ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ ధ్వజం..

94
ktr
- Advertisement -

ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్రం తీరుపై మండిపడ్డారు. దేశంలో మోదీ మార్కు డెమోక్ర‌సీ నడుస్తోందని అంటూ విమర్శించారు. దేశంలో మో’డెమోక్ర‌సీ’ అమ‌లులో ఉంద‌ని చెప్పిన కేటీఆర్‌… ప్ర‌ధాని మోదీ దృష్టి మొత్తం గుజ‌రాత్ అభివృద్ధిపై ఉంద‌ని ఎద్దేవ చేశారు. ఆఫ్ గుజ‌రాత్‌, బై గుజ‌రాత్‌, ఫ‌ర్ గుజ‌రాత్‌, టూ గుజ‌రాత్ అన్న సూత్రంతోనే మోదీ ప‌నిచేస్తున్నార‌ని కేటీఆర్ ఘటుగా విమర్శించారు. పార్ల‌మెంటు సాక్షిగా వ‌రంగ‌ల్‌కు ఇస్తామ‌న్న లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్ట‌రీ హామీని మోదీ తుంగ‌లో తొక్కార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

వరంగల్‌కు కేంద్రం ప్ర‌క‌టించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్ప‌టికీ రాక‌పోగా.. గుజ‌రాత్‌కు మాత్రం ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ కేంద్రం ఇటీవలే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. దానిని ఉద‌హ‌రిస్తూ మోదీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

యావ‌త్తు దేశాన్ని ఒకే దృష్టితో చూడాల్సిన ప్ర‌ధాని మోదీ… రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారని.. త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప‌ట్ల కేంద్రం స‌వతి త‌ల్లి ప్రేమ చూపుతోందంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

- Advertisement -