ఏ ముఖం పెట్టుకొని బండి పాదయాత్ర చేస్తున్నారు.. కేటీఆర్‌ ఫైర్..

68
- Advertisement -

మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేసిన బండి సంజయ్‌కి అవసరమైతే వాహనం ఏర్పాటు చేస్తాం కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులను… తెలంగాణలో ఉన్న పరిస్థితులను పరిశీలించాలి అని మంత్రి కేటీఆర్‌ సూచించారు. తెలంగాణలో పాలన బాగుంది, సంక్షేమ పథకాలు బాగున్నాయి అని తమని తెలంగాణలో కలపమని అన్న బిజెపి రాయచూరు ఎమ్మెల్యేని బండి సంజయ్ కలిసి రావాలి. కర్ణాటకలో ఉన్న అసమర్థ పాలనను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు బండి సంజయ్ అని ప్రశ్నించారు. సోమవారం హెచ్‌ఐసీసీలో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌పై ధ్వజమెత్తారు.

పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పేందుకా… నదీ జలాల్లో వాటా తేల్చకుండా ఏడేళ్లలో శిఖండి సంస్థను ఏర్పాటు చేసి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా.. పాలమూరులో గద్వాల- మాచర్ల వరకు లైను లేకుండా లేట్ చేస్తున్నందుకా… ఏం చెప్పేందుకు బండి సంజయ్ పాలమూరులో పాదయాత్ర చేస్తున్నారు అని కేటీఆర్‌ మండిపడ్డారు. సంజయ్ మాటలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టిలా చేసే వ్యాఖ్యలు తప్పా ఇంకేం లేదు అన్నారు.

ప్రజలకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలి. అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం అంటున్న బండి సంజయ్‌కి కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరో తెలవదా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశవ్యాప్తంగా ఇవన్నీ ఉచితంగా ఇస్తే అడ్డుకుంటున్నార… పక్కనున్న కర్ణాటకలో బిజెపి ఏమైనా ఇస్తున్నదా.. సొల్లు పురాణం, అబద్ధపు మాటలు తప్పించి ఇంకేం లేదు.. అని బిజెపి నేతలపై కేటీఆర్‌ తీవ్ర ఫైర్‌ అయ్యారు.

- Advertisement -