రెండేళ్లలో కరీంనగర్‌కు ఒక్కపైసా తెచ్చావా..?:బండికి కేటీఆర్ సూటి ప్రశ్న

168
ktr
- Advertisement -

ఈ రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రత్యేకంగా ఒక్క పైసా అయినా తెచ్చారా…?అని ఎంపీ బండి సంజయ్‌ని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఇల్లంతకుంట మండలంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…..బీజేపీ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు.

మతం పేరుతో రెచ్చ‌గొట్ట‌డం, చిల్ల‌ర రాజ‌కీయం చేయ‌డం స‌రికాదన్నారు. ద‌మ్ముంటే అభివృద్ధిలో త‌మ‌తో పోటీ ప‌డాల‌ని సూచించిన కేటీఆర్…. చేత‌నైతే కేంద్రం నుంచి రాష్ర్టాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలన్నారు.

బండి సంజయ్‌కి ద‌మ్ముంటే కాలేశ్వ‌రం లేదా పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి జాతీయ హోదా తీసుకురా? అని స‌వాల్ చేశారు. చేతనైతే మ‌రిన్ని జాతీయ ర‌హ‌దారులు, న‌వోద‌య పాఠ‌శాల‌లు తీసుకురా? అని సవాల్ విసిరారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాట్లాడితే కొత్త బిచ్చ‌గాడు అని వ‌దిలిపెడుతున్నారు. ఇప్ప‌టికైనా బుద్ది తెచ్చుకుని మాట్లాడాలన్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్ భారీ మెజార్టీతో

గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు.

- Advertisement -