KTR:రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా..?

51
- Advertisement -

ఢిల్లీ రెజ్లర్ల ఆందోళనపై స్పందించారు మంత్రి కేటీఆర్. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన కేటీఆర్…దేశ ప్రజలు రెజ్లర్లకు మద్దతుగా నిలవాలన్నారు. వారికి మనందరం గౌరవం ఇవ్వాలని..అంత‌ర్జాతీయ వేదిక‌పై దేశ ఖ్యాతిని చాటిన రెజ‌ర్ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? అని ప్ర‌శ్నించారు.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ఆదివారం రణరంగమైన విష‌యం తెలిసిందే. నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరుగగా… సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించి, రెజ్లర్లపైనే కేసులు నమోదుచేశారు.

- Advertisement -