ప్రతీ ఇంటిపై టీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం: కేటీఆర్

175
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవ వేడుకలను నిరాడంబరంగా కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్న‌ట్లు తెలిపారు.

తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం.. మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదాం అని పేర్కొన్నారు.

- Advertisement -