సిరిసిల్లలో మండలానికో వృద్ధాశ్రమం: మంత్రి కేటీఆర్

179
ktr
- Advertisement -

సిరిసిల్ల నియోజకవర్గంలో మండలానికో వృద్ధాశ్రమాన్ని సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. గురువారం సిరిసిల్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పట్టణంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… అనాథ వృద్ధులను ఆదుకునేందుకు సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో మండలానికో వృద్ధాశ్రమాన్ని సొంత ఖర్చులతో నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు.

సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఎన్నికల కోసం సన్నద్ధం కావాలి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నామినేటెడ్ పోస్టుల‌ను త్వరలోనే భర్తీ చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పి చైర్ పర్సన్ నేలకొండ అరుణ, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

- Advertisement -