కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడి..

89
koppula
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, బుగ్గారం, మద్దునూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి, మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుభీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు.

అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమం మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, యంపిపి బాదినేని రాజమణి, వైస్ యంపిపి సుచింధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -