ప్రతీ 5వేల ఎకరాలకు రైతువేదిక:మంత్రి కొప్పుల

229
koppula
- Advertisement -

ప్రతి 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించనున్ననదని వెల్లడించారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌.జూలపల్లి మండలం అబ్బాపూర్‌ గ్రామంలో రూ. 12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతే వేదిక భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల…రైతును రాజు చేయడమే టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రైతులు ఒకే దగ్గర సమావేశమై పంటలు,దిగుబడి,లాభాలు చర్చించేందుకు గోదాంలను వినియోగించుకునేలా రైతు వేదికలకు రూపకల్పన చేసిందన్నారు.

భూమి తల్లిని నమ్ముకున్న రైతులంతా విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు కష్టాలతో సహవాసం చేస్తుంటారు. అనంతరం అబ్బాపూర్ బీరన్న దేవాలయం లో హైమాస్ట్ విద్యుత్ దీపాల ఏర్పాటుకు భూమి పూజా చేశారు. కార్యక్రమంలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ స్థానిక శాసన సభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ భారతి హొళికెరి పాల్గొన్నారు.

- Advertisement -