కోట్లాది భక్తుల ఆరాధ్యదైవం..వేములవాడ రాజన్న

57
koppula
- Advertisement -

కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం వేములవాడ రాజన్న అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మంగళవారం వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొప్పుల..సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.

ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు భూసేకరణ పనులు ప్రారంభించారన్నారు.ముడి చెరువులో 35 ఎకరాలు ఇప్పటికే సేకరణ పూర్తయిందని …బద్ది పోచమ్మ ఆలయం విస్తరణకు సైతం భూసేకరణ కూడా పూర్తి చేశారన్నారు. యాదాద్రి ఆలయంలాగే సీఎం కేసీఆర్‌ వేములవాడ, కొండగట్టు ధర్మపురి, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలనుకూడా అభివృద్ధి చేస్తారని చేస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -