హర్యానాకు మంత్రి కొప్పుల ఈశ్వర్..

115
Minister Koppula Eshwar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం ఢిల్లీ నుంచి హర్యానాకు బయలుదేరారు. హర్యానా పర్యటనకు వెడతూ మార్గమధ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రి బస చేశారు. మంత్రి కొప్పులతో పాటు అధికారులు హర్యానాకు బయలుదేరిన సందర్భంలో పెద్దపల్లి లోకసభ సభ్యుడు వెంకటేష్ నేతకాని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ లు వీడ్కోలు పలికారు.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ మినీ డైరీల ఏర్పాటుకు మహిళలకు సబ్సిడీపై రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ డైరీల కోసం హర్యానా నుంచి మేలి రకం బర్రెలు తెలంగాణకు తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా పశుసంపదను,పాడి పరిశ్రమ తీరుతెన్నులు పరిశీలించేందుకు మంత్రి ఈశ్వర్ హర్యానా వెళ్లారు.

- Advertisement -