మైనారిటీ వర్గాలు కేసీఆర్‌కు రుణపడి ఉంటాయి..

207
Minister Koppula Eshwar
- Advertisement -

నేడు అసెంబ్లీ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు ఈటెల రాజేందర్ ,కొప్పుల ఈశ్వర్ ,సత్యవతీ రాథోడ్ ,ప్రభుత్వ విప్ బాల రాజు ,రేగా కాంతా రావు ,ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అసెంబ్లీ హాల్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…ఈ రోజు శుభదినం.. రాజ్యాంగ నిర్మాత బీ ఆర్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి సంబంధించి జీవో విడుదలైందన్నారు మంత్రి కొప్పుల.

బాబా సాహెబ్ 125వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భారీ విగ్రహం ఏర్పాటుకు అనుమతులకు సంబంధించి జీవో నంబర్ 2 విడుదలైంది. ఇందు కోసం 140 కోట్ల రూపాయల ఖర్చవుతుందని.. హుస్సేన్ సాగర్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో అంబెడ్కర్ పార్కు ఏర్పాటు అవుతుందని మంత్రి తెలిపారు.ఈ పార్కులో విగ్రహంతో పాటు,మ్యూజియం,లైబ్రరీ కూడా ఉంటాయి..సీఎం కెసిఆర్ కు దళిత,గిరిజన,మైనారిటీ వర్గాలు రుణ పడి ఉంటాయని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.

విగ్రహం వెడల్పు 45 .5 ఫీట్లు
ఈ విగ్రహానికి వాడే స్టీలు 791 టన్నులు
విగ్రహానికి వాడే ఇత్తడి …96 మెట్రిక్ టన్నులు
అంబెడ్కర్ విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

- Advertisement -