రాష్ట్రంలో అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్- మంత్రి కొప్పుల

158
minister koppula
- Advertisement -

మన రాష్ట్రంలో అభివృద్ధి చేసేది టీఆర్‌ఎస్‌ పార్టీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 135వ డివిజన్ ఇంచార్జ్‌గా సుభాష్ నగర్, ఇందిరనగర్, వేది విహార్‌లో మంత్రి కొప్పుల టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సబితా- అనిల్ కిషోర్ గెలుపు కోసం గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో తిరుగుతున్న సమయంలో మంత్రికి, టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళలు చిన్న సన్మానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు మాత్రమే అయింది కానీ 60 సంవత్సరాల అభివృద్ధి ఆరు సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి మున్సిపాలిటీ దాక చాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. ఈ విషయాలను జిహెచ్ఎంసి ప్రజలకు తెలియజేసి తెలంగాణ పార్టీని మనం అందరం కలిసి గెలిపించుకోవాలి. కారు గుర్తుకే ఓటేద్దాం.. మన డివిజన్‌ను అభివృద్ధి చేసుకుందామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

- Advertisement -