గడ్కరీతో మంత్రి కొప్పుల ఈశ్వర్ భేటీ..

455
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్టానికి సంబంధించిన పలు రహదారుల నిర్మాణంపై నితిన్ గడ్కరీతో మంత్రి కొప్పుల చర్చించించారు. సెంట్రల్ రోడ్ నిధుల (CRF)తో దాదాపు 130 కోట్లతో పలు ప్రాజెక్టులు చేపట్టాలని వినతి పత్రం అందించారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పులతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

mp nama

అలాగే జగిత్యాల,పెద్దపల్లి జిల్లాలలో 15 రహదారులు మరియు నేషనల్ హైవే నిర్మాణం చేపట్టాలని కోరారు. NH 63 నిజామాబాద్, జగ్దల్ పూర్ 121/800, నుండి 128/200 వరకు ధర్మపురి నియోజకవర్గంలో (7km) ఫోర్ లైన్ మంజూరు చేయాలని కోరిన మంత్రి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -