ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల..

63
- Advertisement -

స్థానిక సంస్థల శాస‌న‌మం‌డలి సభ్యు‌లుగా ఇటీ‌వల ఎన్ని‌కైన పోచం‌పల్లి శ్రీని‌వా‌స్‌‌రెడ్డి, టీ భాను‌ప్ర‌సాద్‌, ఎంసీ కోటి‌రెడ్డి, దండె విఠల్ శాసనమండ‌లి‌లో నేడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి శాసనమండలిలో పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, మ‌హ‌ముద్ అలీ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన న‌లుగురు ఎమ్మెల్సీల‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -