ఆత్మగౌరవంతో బ్రతికేందుకే ఆసరా పింఛన్లు: కొప్పుల ఈశ్వర్

183
koppula eshwar
- Advertisement -

సీనియర్ సిటిజన్స్ ఆత్మగౌరవంతో బ్రతికేందుకు ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వృద్ధులు మన జాతి సంపద…. మన వారసత్వానికి ప్రతినిధులు. వారిని గౌరవించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో గల గాయత్రి విశ్వ కర్మ వృద్ధుల ఆశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. వృద్ధుల సంక్షేమం, ఆహారం, ఆరోగ్యం తదితర విషయాల పరిశీలన, ఆశ్రమ నిర్వహణ సమస్యల పరిష్కారం, నిపుణుల సూచనలు, సలహాలు తదితర అంశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ఆప్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక శాసన సభ్యుడు సంజయ్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ బోగ శ్రావణి, కలెక్టర్ రవి, ఆర్డీవో మాధురి, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ అధికారి నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -