రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలి

418
MinisterJagadishReddy
- Advertisement -

సూర్యపేటలో రహదారుల విస్తరణ నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలని అధికారులకు సూచించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హైదరాబాద్ లోని మోక్షంగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో పబ్లిక్ హెల్త్ అధికారులతో సూర్యపేట పట్టణం లోని రహదారుల విస్తరణ,డ్రైనేజీ నిర్మాణపు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఇ ఎన్ సి శ్రీధర్ యస్ సి దేవానంద్ ఇ ఇ వెంకటేశ్వర్లు డి యి రమాదేవి,ఏ యి స్వాతి ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారుల విస్తరణకు డ్రైనేజీ నిర్మాణాలు అడ్డు కాకూడదని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో మట్టికి బదులు కాసింత ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కంకర పోడినే వినియోగించాలని అధికారులకు సూచించారు. పట్టణంలో జరుగుతున్న రహదారుల విస్తరణ తో పాటు నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -