హాలియా సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్ రెడ్డి…

182
minister Jagadish reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ ఈ నెల 10న నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అనుముల మండలం అలీనగర్‌ సమీపంలో భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనుండగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

12 నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వాహనాల పార్కింగ్‌ కోసం 200 ఎకరాల భూమిని సిద్ధం చేశారు.

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 1,04,600 ఎక‌రాల టేలాండ్‌ భూము‌లకు సాగు‌నీరు అందించేందుకు రూ.3వేల కోట్లతో 13 ఎత్తి‌పో‌తల పథ‌కాల ఏర్పా‌టుకు సీఎం కేసీఆర్ ఇటీవల అనుమతిచ్చారు. ఈ మేరకు పనులకు పర్యటనలో సీఎం కేసీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.

- Advertisement -