ముస్లిం కుటుంబాలకు అండగా మంత్రి జగదీష్..

486
minister jagadish
- Advertisement -

రంజాన్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ముస్లిం కుటుంభాలకు అండగా నిలిచారు మంత్రి జగదీష్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న 5 వెల కుటుంబాలకు ప్రత్యేకంగా తన సొంత నిధులతో తయారుచేయించిన బియ్యం, నిత్యవసర సరుకుల గల ప్యాక్ ను సూర్యాపేట పట్టణంలో, రాయిని గూడం గ్రామంలో స్వయంగా వారి ఇండ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు జగదీష్ రెడ్డి.

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా ఆదుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు…రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అదే విధిగా భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు…ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కు మంత్రి జగదీష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి వెంట జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్,ముస్లిం మత పెద్దలు , స్థానిక TRS నాయకులు ఉన్నారు.

- Advertisement -