పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసట..

426
Minister Jagadish Reddy Help To Poor Brahmins
- Advertisement -

కరోనా కరువులో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచాడు. లాక్ డౌన్ నేపద్యంలో నిత్యపూజలతో పాటు పురోహితంపై ఆధారపడిన కుటుంబాలకు బియ్యంతో సహా నిత్యావసర సరుకులనందించి ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 108 కుటుంబాలకు బియ్యం ఇతర నిత్యావసర సరుకుల ను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు.

Minister Jagadish Reddy Help To Poor Brahmins

నిత్యపూజలు ఆగిపోయి,శుభ కార్యాలు జరగక అవస్థలు పడుతున్న తమను గుర్తించి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆశీర్వచనంతో కృతజ్ఞతలు తెలిపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -