బండి సంజయ్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

76
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నాము. బండి సంజయ్ వంద కార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడులు చేస్తున్నారు. గత ఆరు సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్ చిచ్చు పెడుతుండు. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బండి సంజయ్ కేంద్రంతో చెప్పించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు నిలదీస్తే బండి సంజయ్ గుండాలు దాడి చేస్తుండ్రు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -