విద్యుత్‌ రంగంపై కేంద్రం కుట్రలు- మంత్రి జగదీష్‌ రెడ్డి

69
- Advertisement -

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన మహాధర్నాలో మంత్రి జగదీష్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాలు ఒప్పుకోవడం ఇష్టం లేక ప్రతిపక్ష నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో పెద్దఎత్తున పంట పండుతుంటే తట్టుకోలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.

రాష్ట్రంలో వరి పంట పండించడంలో నల్లగొండ జిల్లా తొలి స్థానంలో ఉందని చెప్పారు. అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరుబావులున్న జిల్లా నల్లగొండ అని వెల్లడించారు. బీజేపీ నేతలపై నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రస్థాయిలో స్పందించారని మంత్రి అన్నారు. దొడ్డి కొమురయ్య, ఐలమ్మ పోరాట వారసత్వాన్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరేండ్లలో నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పదవులు ఓ లెక్కకాదని చెప్పారు. విద్యుత్‌ రంగంపై కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. 60 ఏండ్ల విద్యుత్‌ గోసను ఆరు నెలల్లో తీర్చామన్నారు మంత్రి.

- Advertisement -