అమిత్ షా మాటలపై మండిపడ్డ మంత్రి జగదీశ్‌

63
mini
- Advertisement -

మునుగోడులో హోం మంత్రి అమిత్‌, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనన్నారు. అన్నీ నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. కేసీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మునుగోడు సభలో అమిత్ షా కేసీఆర్ పై అక్కసు కనబరిచారే తప్ప… కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఆయనకు లేదని స్పష్టం చేశారు. తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని అమిత్ షాపై మండిపడ్డారు. సీఎం ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా బీజేపీ నేతలకు లేదన్నారు. దిగజారుడు తనం ఆయన మాటల్లో ధ్వనించిందన్నారు.

అమిత్ షా మాటలు హోం మంత్రిత్వశాఖ స్థాయిలో లేవని, ఫాల్త్‌ రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం తప్ప మరొకటి మాట్లాడలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న మంత్రి… పెట్రోల్ ధరల విషయంలో దొంగే దొంగన్నట్లుగా అమిత్ షా మాట్లాడారని విమర్శించారు.

మునుగోడు సభలో వరాలు కురిపిస్తారని రాష్ట్ర బీజేపీ నాయకులు భావించారని… కానీ అమిత్ షా వాళ్లకి నిరాశ మిగిల్చారని ఎద్దేవా చేశారు. అమిత్ షా పర్యటన వల్ల మునుగోడుకు గానీ, రాష్ట్రానికి గానీ ఒరిగిందేమీ లేదని చెప్పారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ఓట్లు, సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు. కేంద్ర హోం మంత్రి వరాలు ప్రకటిస్తారని మునుగోడు ప్రజలు ఆశపడ్డారని, షా మాటలు వారిని నీరుగార్చాయన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులనీ, బీజేపీకి తప్పక మీటరు బిగిస్తరన్నారు.

- Advertisement -