కేంద్రం చొరవ చూపాలి- మంత్రి జగదీష్ రెడ్డి

57
Minister Jagadish Reddy
- Advertisement -

ధాన్యం కొనుగోలకు ఎఫ్‌సిఐలు ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు. యాసంగిలో కొనుగోలు చేసిన దాన్యంతో గోడౌన్ లు నిండి పోయాయని ఎఫ్‌సిఐ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సూర్యపేట క్యాంప్ కార్యాలయంలో సూర్యపేట, నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డితో భేటి అయ్యారు.

ఈ భేటీలో తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మంత్రి జగదీష్ రెడ్డిని కలసిన వారిలో నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిపోలు యాదగిరి,జనరల్ సెక్రెటరీ రేపాల భద్రాద్రి రాములు, గౌరవ అధ్యక్షులు కందుకూరి మహేందర్, నల్లగొండ సెంటర్ అధ్యక్షులు కర్నాటి నారాయణ, నకేరికల్ సెంటర్ అధ్యక్షులు కన్మంత రెడ్డి కేశవరెడ్డి, మిర్యాలగూడ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, సూర్యాపేట రైస్ మిల్లర్స్ అధ్యక్షులు బొనలా రవీందర్, భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ జనరల్ సెక్రెటరీ నాగభూషణం, ఉమ్మడి నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ 150 మంది వరకు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత చర్యలతో తెలంగాణకు ఇక్కట్లు ఎదురువుతున్నాయాన్నారు. అందులో మొదటిది వ్యవసాయ చట్టం అయితే.. రెండోది విద్యుత్ సంస్కరణలు అని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ రెండు చట్టాలు కూడా ఆదాని కోసమేనని ఆయన స్పష్టం చేశారు. అదే గనుక జరిగితే ఓనర్లు గుమస్తాలు కావడం ఖాయమన్నారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

- Advertisement -