కష్టపడి పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు: మంత్రి జగదీష్ రెడ్డి

332
minister jagadeesh
- Advertisement -

కష్టపడి పనిచేసే ప్రజాప్రతినిధుల మీద ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలా పల్లెల్లో ప్రగతికి అదే స్పూర్తితో పనిచేయాలన్నారు.

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని… గ్రామీణాభివృద్ధి ప్రణాళికలకు రూపం ఇచ్చినా శిల్పి సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశించిన పద్దతిలో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలన్నారు. రు. ప్రజలను బెంబేలిస్తున్న సమస్య చెత్త డంపింగ్‌. ఈ సమస్యకు పరిష్కారమే ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డ్‌ల ఏర్పాటు అన్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని శ్మశాన వాటిక రాష్ట్రానికే రోల్‌ మోడల్‌గా మారిందన్నారు. అభివృద్ధి రుచి తెలిసిన గ్రామాలు మరింత అభివృద్ధికి పోటీ పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్‌ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌, బొల్లం మల్లయ్య యాదవ్‌, శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ దీపికా యుగంధర్‌ రావు, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -