ఎవరు ఆకలితో ఇబ్బంది పడవద్దు: మంత్రి జగదీష్

251
minister jagadeesh reddy
- Advertisement -

ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బంది పడవద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా…. సూర్యాపేట పట్టణములో నిరాశ్రయులు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ…..కరోనా వైరస్ ను అంతమొందించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందన్నారు. కర్ఫ్యూ విధించడంతో యచకులు, ఇతర రాష్ట్రాల నుంచి బ్రతుకుదేరువు కోసం వచ్చిన వారికి ప్రభుత్వం ఆశ్రయం కల్పించి భోజన వసతి కల్పిస్తున్నదని తెలిపారు..

ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బంది పడొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి స్వయంగా వారికి అన్నం వడ్డించారు.

- Advertisement -