ఐక్యమత్యంతో కరోనాను జయిద్దాం: జగదీష్ రెడ్డి

286
minister jagadeesh
- Advertisement -

ఐక్యమత్యంతో పనిచేసి కరోనాను జయిద్దామని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామా ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 వేల లీటర్ల సానిటైజర్లు , 3 వేల మాస్కులను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అందించారు ఎంపీ నామా నాగేశ్వర్ రావు .

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి ..కరోనా ను నియంత్రించడానికి ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలు సహాయం అందించడం అభినందనీయం అన్నారు. కరోనా టెస్టుల విషయంలో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ అర్ధరహితంగా మాట్లాడుతున్నారని….రాష్ట్రంలోనే అత్యదిక పరీక్షలు సూర్యాపేట జిల్లాలో చేశామని వెల్లడించారు.

కాంగ్రెస్ నాయకుల తీరు కరోనా పోవద్దు,, ప్రజలు ఇబ్బందులు పడాలి అన్నట్లు ఉందని మండిపడ్డారు. కరోనా మహహమ్మరి విషయంలో కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని…రైతులెవ్వరూ ఇబ్బంది పడికుండా రాష్ట్ర చరిత్రలోనే పండించిన ప్రతి గింజను రైతుల వద్దకే వెళ్లి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్ళల్లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

- Advertisement -