రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్..

279
ik reddy
- Advertisement -

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్.

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. రాష్ట్ర ప్రజ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -