పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తాం- మంత్రి

130
minster allola
- Advertisement -

నిర్మల్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తూ నిర్మల్ జిల్లాను మరింత అభివృద్ధి పరుస్తామని అటవీ,పర్యావరణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్యామ్ గడ్ కోట చుట్టూ మున్సిపల్ నిధులు 16.50 లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020 సంవత్సరం కరోనతో గడిచిపోయిందని.. 2021 సంవత్సరం ప్రతి ఒక్కరికి కొత్తదనం రావాలని తెలిపారు.

నాటి రాచరిక పాలనకు గుర్తుగా పురాతన కోటలను అభివృద్ధి పరిచేందుకు పర్యాటక రంగంతో పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. కంచ రొని చెరువులో బోటింగ్ సౌకర్యం కనిపించినట్లయితే పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. త్వరలోనే కంచరోని చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పురాతన సోన్ బ్రిడ్జిని అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు సూచించారు.

కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడంలో నిర్మల్ మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోష కరమనిన ఇందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు మంజులాపూర్‌లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్‌ను ప్రారంభించారు. పట్టణంలో 14 జంక్షన్ లలో హైమాస్ట్ లైటింగ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

- Advertisement -