పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఐకే రెడ్డి..

49
- Advertisement -

దక్షిణ అయోధ్య భద్రాచలంలో శ్రీరామ కల్యాణం కన్నుల పండువగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలో లక్షలాది భక్త జనసందోహం మధ్య కల్యాణ వేడుక అంగరంగవైభవంగా జరుగుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు.
శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగుతున్నాయి. అభిజిత్‌ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయనున్నారు శ్రీరామచంద్రమూర్తి.

స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు,త్రిదండి చినజీయర్ స్వామి తదితరులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -