స్వామివారి కళ్యాణోత్సవానికి తరలిరండి: మంత్రి ఐకే రెడ్డి

77
- Advertisement -

నిర్మ‌ల్ లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 6న నిర్వహించే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప్ర‌జ‌లపై యాదాద్రి ల‌క్ష్మీన‌ర్సింహ స్వామివారి ఆశీస్సులు ఉండాలనే సంక‌ల్పంతో స్వామివారి క‌ళ్యాణ మ‌హోత్స‌వం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

స్వామివారి ఉత్స‌వ విగ్ర‌హాల‌తో క‌నుల పండుగ‌గా జ‌రిగే ఈ మ‌హాత్కార్యానికి నిర్మ‌ల్ జిల్లా ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి, క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించాల‌ని కోరారు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకుని స్వామివారి ఆశీర్వాదం పొందాల‌ని సూచించారు. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుంగా అన్ని ఏర్పాట్ల‌ను చేస్తున్నామ‌న్నారు.

బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వండి..

సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ప్రజలు విరాళంగా అందివ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆల‌య పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌నుకునే భ‌క్తులు స్వ‌చ్చంద విరాళాలు ఇవ్వ‌వ‌చ్చ‌ని సూచించారు.

- Advertisement -