టీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

161
ik reddy
- Advertisement -

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రైతుల సంక్షేమం కో సం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. మామ‌డ మండలం పొన్కల్‌లో రైతువేదిక భ‌వ‌నాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డి…ఒకే వేదికలో రైతులందరూ కలిసి ఏయే పంటలు పండించుకోవాలో నిర్ణయించుకుని వాటిని సాగుచేయాలని సూచించారు. గ్రామంలో వ్యవసాయశాఖ అధికారి సలహాలు, సూచనలతో పంటలు వేయాల‌ని కోరారు.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. సాగునీటి వసతి, 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్నదని చెప్పారు.

- Advertisement -