మెడికల్‌ విద్యార్థులకు లోకల్‌ రిజర్వేషన్లు

110
harishrao
- Advertisement -

రానున్న రోజుల్లో బీ కేటగిరీలో లోకల్ రిజ్వేషన్లు అమలు చేస్తామని, పీజీ సీట్లను 40 వరకు పెంచుతున్నామని తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో నిర్వహించిన మెడ్‌ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. గతంలో వైద్యవిద్య కోసం ఉక్రెయిన్, రష్యాకు వెళ్లి చదువుకునే వారని … ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, రాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో సిద్దిపేటలో రూ.15 కోట్లతో క్యాథలాబ్ గుండె చికిత్స, రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామన్నారు. సిద్దిపేటలో 900 పడకల దవాఖానను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

- Advertisement -