సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి…హరీష్ ప్రత్యేక పూజలు

146
harish
- Advertisement -

సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని , సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సిద్దిపేట రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట పట్టణంలోని పట్టాభి రామాలయంలో సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు.

కరోనా కారణాల వల్ల ఈ ఏడాది సీతారాముల కళ్యాణం ఆలయానికి పరిమితం..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కెసిఆర్ అన్నీ దేవుండ్ల, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం కెసిఆర్ రాష్ట్ర ఖజానా నుండి దేవాలయాలకు నిధులు వెచ్చించి పూర్వ వైభవం తెస్తున్నారని చెప్పారు. ఆలయాలను వైభవంగ తీర్చిదిద్దుతున్నారని…. 2కోట్ల10 లక్షల తో ఈ ఆలయాన్ని పునర్ నిర్మాణం చేస్తాం అన్నారు.

- Advertisement -