పంజాబ్‌ రైతాంగమే ఈడ్చి తన్నింది: రాహుల్‌పై హరీశ్ ఫైర్

29
rahul
- Advertisement -

వరంగల్ కాంగ్రెస్ డిక్లరేషన్ సభలో ఆ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రి హరీశ్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ రైతు డిక్లరేషన్‌ను పంజాబ్‌ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని విమర్శించారు.

కాంగ్రెస్‌ది రైతు సంఘరణ సభ కాదని, రాహుల్‌ సంఘర్షణ సభ అన్నారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్‌ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నిందని…తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

- Advertisement -