బీజేపీ వస్తే ఆర్టీసీని అమ్ముతుంది: హరీష్

77
harishrao
- Advertisement -

బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్..● తెలంగాణకు మాటలు- గుజరాత్ కు మూటలు ఇస్తారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించిన హరీష్‌…..15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 9 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలన్నారు.

ఇక అంతకముందు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, యువజన అండ్ లైబ్రరీ భవనం, అంగన్ వాడీ భవనాన్ని, రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

- Advertisement -