న్యాయవాదులు వాణీదేవిని గెలిపించండి: హరీశ్‌ రావు

139
Harish rao
- Advertisement -

న్యాయవాదులు తమ ఓట్లతో వాణీదేవిని గెలిపించాలన్నారు మంత్రి హరీశ్‌ రావు. హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా తాండూరు ఆర్యవైశ్య భవన్‌లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అడ్వకేట్లకు రూ.100 కోట్లతో వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణేనన్నారు. రాంచందర్‌రావు ఆరేళ్లలో అడ్వకేట్లకు చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణతో తాండూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిందన్నారు.

ఆర్‌ఎంపీ, పీఎంసీలు ఉద్యమంలో, రాష్ట్రాభివృద్ధిలో సహకారం అందించారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోసారి సహకరించాలన్నారు. కరోనాతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, పిల్లల భవిష్యత్‌ను ఆలోచించి ఆరో తరగతి నుంచి విద్యాసంస్థలు ప్రారంభించామన్నారు. లక్ష మంది పట్టభద్రులను తయారు చేసిన మంచి అభ్యర్థి వాణీదేవికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు.

- Advertisement -