సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌..

199
harishrao
- Advertisement -

సీఎం కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేటలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన,టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి హరీశ్‌ రావు.

జిల్లా కేంద్రానికి శివారులో నిర్మించిన ఐటీ టవర్‌- ఇండస్ట్రియల్‌ పార్క్‌ శంకుస్థాపన పనులను పర్యవేక్షించారు. అనంతరం సిద్ధిపేట-పొన్నాలలో తెలంగాణ భవన్‌ సిద్ధిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని, సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రారంభించనున్నారు. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

రంగనాయకసాగర్‌ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు.

- Advertisement -